భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగిక దాడి చేయించిన భార్య

హైదరాబాద్లో రోజురోజుకు నేరాలు అధికమవుతున్నాయి. పరువు హత్యలు, అత్యాచారాలు, మహిళలపై లైంగిక దాడులకు భాగ్యనగరంలో వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది. తన భర్తకు సన్నిహితంగా ఉంటోందన్న కారణంగా యువతిపై ఓ వివాహిత లైంగిక దాడి చేయించింది. ఈ ఘటన కొండాపూర్లో చోటుచేసుకుంది. కొండాపుర్లో శ్రీకాంత్ తన కుటుంబంలో సహా నివాసం ఉంటున్నాడు. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. అదే కాలనీలో నివాసం ఉండే యువతి సైతం యూపీఎస్సీకి ప్రిపేర్ కావడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్న శ్రీకాంత్ భార్య.. యువతిపై కోపం పెంచుకుంది. పోలీసులను సైతం ఆశ్రయించింది. అయినా యువతిని ఏదో చెయ్యాలని పథకం వేసింది.
కేసు వెనక్కి తీసుకుంటానంటూ ఇంటికి పిలిచింది. పథకం ప్రకారం ఓ గదిలోకి తీసుకెళ్లి నలుగురు యువకులతో ఆమెపై లైంగిక దాడి చేయించింది. యువతి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హించించారు సదరు యువకులు. అంతటితో ఆగక ఈ వ్యవహారాన్ని ఫోన్లో వీడియో తీశారు. ఈ లైంగిక దాడి విషయం ఎవరికి చెప్పినా వీడియోలు ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితులని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు మహిళ సహా నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.